మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు పొన్నం ప్రభాకర్ క్షమాపణ

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు పొన్నం ప్రభాకర్ క్షమాపణ

తెలంగాణ (Telangana) కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో ఇటీవల తలెత్తిన అంతర్గత విభేదాలు ఎట్టకేలకు సద్దుమణిగాయి. టీపీసీసీ (TPCC)  మాజీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) నేతృత్వంలో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar).. తన వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ (Adluri Lakshman)కు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ఈ చర్య ద్వారా పార్టీలో ఐక్యతను కాపాడేందుకు స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లయింది.

పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “అడ్లూరి లక్ష్మణ్ ఇబ్బంది పడ్డారు. అందుకే నేను బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. అన్ని విషయాలు కేవలం కుటుంబ సంబంధ సమస్యలుగానే పరిగణించాలి. దయచేసి ఈ సమస్యను ఇంతటితో ముగించాలని కోరుకుంటున్నాను” అని స్పష్టం చేశారు. అనంతరం మహేష్ గౌడ్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉంటుంది. పార్టీలోని ప్రతి కార్యకర్త, నాయకుడు ఐక్యంగా పని చేయాలని మేము కోరుకుంటున్నాం” అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment