తెలంగాణ (Telangana) రాజ్ భవన్ (Raj Bhavan) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) భేటీ అయ్యారు. ఉగాది సందర్భంగా గవర్నర్కు సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, ఈ మర్యాదపూర్వక భేటీకి మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) అంశం ప్రధానంగా నిలిచిందని సమాచారం. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కొత్త మంత్రుల ఎంపికపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3న కొత్త మంత్రులతో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గవర్నర్తో సీఎం భేటీ.. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ?
