బీసీ రిజర్వేషన్ల సెగ‌.. నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌

బీసీ రిజర్వేషన్ల సెగ‌.. నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌

“బంద్‌ ఫర్‌ జస్టిస్‌” (bandh  for Justice) నినాదంతో తెలంగాణ (Telangana) రాష్ట్రం నేడు పూర్తిగా బంద్‌ మూడ్‌లోకి వెళ్లింది. బీసీ సంఘాల జేఏసీ (JAC) పిలుపునిచ్చిన ఈ బంద్‌కు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రజా మద్దతు లభించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (Reservations) అమలు చేయాలని, అలాగే ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

బంద్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రవాణా, విద్యా, వాణిజ్య కార్యకలాపాలు దాదాపు స్తంభించాయి. విద్యా సంస్థలు బంద్‌ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే సెలవులు ప్రకటించాయి. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లు నేడు పూర్తిగా మూసివేశారు.

రాజకీయ పార్టీలు, సంఘాల మద్దతు
బీసీ సంఘాల బంద్‌కు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్‌ (BRS) పార్టీ నేతలు ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్‌ నుంచి బయలుదేరి, పలు జిల్లాల్లో బంద్‌ కార్యక్రమాల్లో పాల్గొన‌నున్నారు. మండల, జిల్లా స్థాయిలో బీఆర్ఎస్‌ కార్యకర్తలు భారీ ఎత్తున బీసీ సంఘాలకు సంఘీభావం తెలిపారు.

రవాణా స్తంభన
ఉదయం నుంచే రాజేంద్రనగర్‌, మియాపూర్‌, వరంగల్‌, ఖమ్మం వంటి ప్రాంతాల్లో బీసీ నాయకులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, బస్సులు డిపో నుంచి బయటకు రానివ్వలేదు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా సేవలు పాక్షికంగా స్తంభించాయి. ఈ బంద్‌తో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ ప్రధాన చర్చావిషయంగా మారింది. ప్రభుత్వం తమ డిమాండ్లను గమనించి త్వరగా చర్యలు తీసుకోవాలని బీసీ జేఏసీ స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment