లీడ్స్లో భారత్ (India), ఇంగ్లాండ్ (England) మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ (Test Match)లో టీమిండియా (Team India) ఓ అరుదైన ఘనతను నమోదు చేసి చరిత్ర సృష్టించింది. 93 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఒకే టెస్ట్ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్స్ (Indian Batsmen) ఏకంగా ఐదు శతకాలతో (Five Centuries) చెలరేగిపోయారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలాంటి అద్భుతం కేవలం ఆరుసార్లు మాత్రమే జరగగా, విదేశీ గడ్డపై ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ నిలిచింది.
తొలి ఇన్నింగ్స్ హైలైట్స్
లీడ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) (101), డాషింగ్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) (147), మరియు విధ్వంసకర బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) (134) తమ అద్భుత శతకాలతో భారత్ను 471 పరుగుల భారీ స్కోరు (Huge Score)కు చేర్చారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ జట్టు కౌంటర్ అటాక్కు దిగి 465 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు కేవలం 6 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది.
భారత్ తరపున బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా (5/83) ఐదు వికెట్లతో, ప్రసిద్ధ్ కృష్ణ (3/128) మూడు వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికొస్తే, ఓల్లీ పోప్ (106), బెన్ డకెట్ (62), హ్యారీ బ్రూక్ (99), జేమీ స్మిత్ (40), మరియు క్రిస్ వోక్స్ (38) లు కీలక పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు.
రెండో ఇన్నింగ్స్: పంత్ రికార్డు..
భారత్ రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (137) మరోసారి శతకంతో రాణించగా, రిషబ్ పంత్ (118) తన రెండో శతకాన్ని నమోదు చేశాడు. పంత్ ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలోనూ శతకాలు సాధించి, టెస్ట్ క్రికెట్లో ఒకే టెస్ట్లో రెండుసార్లు శతకాలు నమోదు చేసిన తొలి భారత వికెట్ కీపర్గా చరిత్ర సృష్టించాడు.
సోమవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు సాధించింది. మంగళవారం ఐదోరోజు ఆట ప్రారంభం కాగా, లంచ్ సమయానికి ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 117 పరుగులు చేసింది. ఇంకా 254 పరుగులు చేయాల్సింది. టీమిండియా విజయానికి 10 వికెట్లు నేలకూల్చాలి. లీడ్స్ టెస్ట్ ఉత్కంఠగా మారిన నేపథ్యంలో, చివరి రోజు ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.