‘నాపై వార్త‌లు రాస్తే రైలు ప‌ట్టాల‌పై ప‌డుకోబెడ‌తా..’ – టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్‌

టీడీపీ ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌యరాం మీడియా ప్ర‌తినిధుల‌పై రెచ్చిపోయారు. త‌న‌పై క‌థ‌నాలు రాస్తే రైలు ప‌ట్టాల‌పై ప‌డుకోబెడ‌తా అంటూ జ‌ర్న‌లిస్టుల‌కు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే జ‌య‌రాం మీడియా ప్ర‌తినిధుల‌ను బెదిరించ‌డం, ప‌ట్టాల మీద ప‌డుకోబెడ‌తా అంటూ బెదిరింపుల‌కు గురిచేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. గుంతకల్లులోని దోనిముక్కల లే అవుట్‌ను పరిశీలించేందుకు వెళ్లిన ఆయన ఈ కామెంట్స్ చేశారు.


త‌న‌పై వార్తలు రాసినప్పుడు ఆధారాలు కూడా చూపించాలని, లేదంటే పట్టాలపై పడుకోబెడతా..త‌నకు ఎవ‌ర‌న్నా లెక్క‌లేద‌ని వ్యాఖ్యానించారు. అలాంటివ‌న్నీ చేసి ఇక్కడివరకు వచ్చినవాడిని అంటూ రెచ్చిపోయి మాట్లాడారు. త‌న‌పై వివాదాస్ప‌ద వార్త‌లు రాస్తే రైలు ప‌ట్టాల‌పై ప‌డుకోబెట్ట‌డానికి కూడా వెన‌కాడనంటూ మీడియా ప్ర‌తినిధుల‌కు ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌య‌రాం వార్నింగ్ ఇవ్వ‌డంపై జ‌ర్న‌లిస్టు సంఘాలు మండిప‌డుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment