తైవాన్ పార్లమెంట్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన ఎంపీలు రాత్రిపూట భవనంలోకి చొరబడి, స్పీకర్ కుర్చీని ఆక్రమించడానికి ప్రయత్నించారు. ఈ ఘటనను గమనించిన ప్రత్యర్థి పార్టీ ఎంపీలు, వారిని అడ్డుకునేందుకు ముందు వచ్చారు. ఈ క్రమంలో రెండు పక్షాల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటుచేసుకుంది.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఈ గొడవలో పలువురు ఎంపీలకు గాయాలు అయ్యాయి. రాజకీయ అజెండాలకు సంబంధించి పార్లమెంట్లో మామూలు చర్చల స్థానంలో ఇలాంటి హైడ్రామాలు జరగడం విచారకరం అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. బిల్లుల ఆమోదం విషయంలోనే అధికార, విపక్ష పార్టీ ఎంపీల మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది.