Supreme Court

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లాయర్ దాడి యత్నం! దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అమానుష ఘటన చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించడం కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం సృష్టించింది. సీజేఐ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ముందు కేసుల విచారణ జరుగుతున్న సమయంలో, కిషోర్ రాకేష్ అనే వృద్ధ న్యాయవాది వేదిక దగ్గరకు దూసుకెళ్లి, ప్రధాన న్యాయమూర్తిపైకి షూ విసిరేందుకు ప్రయత్నించాడు. అయితే, అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి ఆయన్ను అడ్డుకున్నారు. దాడికి యత్నించిన ఆ న్యాయవాది "సనాతన్ కా అప్మాన్ నహీ సహేంగే" (సనాతన్‌ను అవమానించడాన్ని మేము సహించం) అని గట్టిగా అరుస్తూ కనిపించాడు. భద్రతా సిబ్బంది ఆయన్ని కోర్టు గది నుంచి బయటకు లాక్కెళ్లిపోయారు. వివాదానికి కారణమైన సీజేఐ వ్యాఖ్యలు ఈ దాడి యత్నానికి ప్రధాన కారణం.. ఖజురహోలోని విష్ణువు విగ్రహం కేసు విచారణ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలే. ఏడు అడుగుల ఎత్తైన విష్ణువు విగ్రహాన్ని మళ్లీ తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సీజేఐ వ్యాఖ్యలు: "మీరు మిమ్మల్ని విష్ణువు ఆరాధకుడిగా పిలుచుకుంటే... కొంచెం ప్రార్థన చేసి ధ్యానం చేయండి. వెళ్లి భగవంతుడినే దీనిపై చర్యలు తీసుకోమని అడగండి," అంటూ వ్యాఖ్యానించారు. "ఖజురహో ఒక పురావస్తు ప్రదేశం. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కిందకు వస్తుంది. వారి అనుమతి లేకుండా దీనిలో ఎలాంటి మార్పు సాధ్యం కాదు, క్షమించండి" అని గవాయ్ స్పష్టం చేశారు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నిరసన సీజేఐ చేసిన ఈ వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయని పలువురు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది సత్యం సింగ్ రాజ్‌పుత్ సీజేఐకి బహిరంగ లేఖ రాస్తూ, వ్యాఖ్యలను పునః పరిశీలించాలని లేదా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరో న్యాయవాది వినీత్ జిందాల్ రాష్ట్రపతికి లేఖ రాసి, హిందూ భావాలకు వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే, దాడి యత్నం జరిగినప్పటికీ సీజేఐ గవాయ్ ఏమాత్రం ఆందోళన చెందలేదు. ఇలాంటి దాడులు తనను ప్రభావితం చేయవని వ్యాఖ్యానించి, యథావిధిగా విచారణను కొనసాగించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నం!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌ (B.R. Gavai)పై ఓ న్యాయవాది (Lawyer) దాడికి యత్నించడం కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం ...

తెలంగాణ సర్కార్ కి సుప్రీంకోర్టులో ఊరట!

తెలంగాణ సర్కార్ కి సుప్రీంకోర్టులో ఊరట!

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ‘హైకోర్టులో ఉన్నప్పుడు ...

note-for-vote-mattayya-letter-chandrababu

‘చంద్రబాబు ప్రోత్సాహంతోనే నేను ఇన్వాల్వ్ అయ్యా’

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం ప‌రిణామం చోటుచేసుకుంది. తెలంగాణ‌ (Telangana)లో ఎమ్మెల్సీ(MLC) ఓటు సంద‌ర్భంగా జ‌రిగిన ఈ కేసులో తాజాగా కొన్ని కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏ4గా ఉన్న ...

పంట వ్యర్థాలు తగలబెట్టే రైతులను జైలుకు పంపండి - సుప్రీంకోర్టు

పంట వ్యర్థాలు తగలబెట్టే రైతులను జైలుకు పంపండి – సుప్రీంకోర్టు

పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మరియు రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో రైతులు (Farmers) పంట వ్యర్ధాలను (Crop Wastes) తగలబెడుతూ ఉంటారు.ఈ ప్రకియ ద్వారా భారీగా వాయు కాలుష్యం జరుగుతుంది. దీనికి కారణమవుతున్న ...

వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు కీలక మధ్యంతర తీర్పు వెలువరించింది. చట్టంలోని కొన్ని నిబంధనలపై తాత్కాలిక స్టే విధించింది. ముఖ్యంగా ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలనే నిబంధనను నిలిపివేయడంతో పాటు మరికొన్ని కీలక సెక్షన్ల ...

పహల్గాం దాడి: భారత్-పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్

పహల్గాం దాడి: భారత్-పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్

ఆసియా కప్ 2025లో భారత్ మరియు పాకిస్థాన్‌ల మధ్య ఆదివారం జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, పహల్గాం, ఆపరేషన్ సిందూర్‌ ఘటనల నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ...

9 నుంచి 12వ తరగతులు తెలంగాణలో చదివితేనే లోకల్: సుప్రీంకోర్టు స్పష్టీకరణ.

9 నుంచి 12వ తరగతులు తెలంగాణలో చదివితేనే లోకల్: సుప్రీంకోర్టు స్పష్టీకరణ.

తెలంగాణ (Telangana)లో స్థానికత (Locality) రిజర్వేషన్ల (Reservations)పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి గొప్ప ఊరటనిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ...

'సుప్రీం'లో కొమ్మినేనికి భారీ ఊర‌ట‌.. పోలీసుల‌కు చీవాట్లు

‘సుప్రీం’లో కొమ్మినేనికి భారీ ఊర‌ట‌.. పోలీసుల‌కు చీవాట్లు

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస‌రావుకు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం భారీ ఊర‌ట క‌ల్పించింది. సాక్షి టీవీ డిబేట్ కేసులో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు సంపూర్ణ బెయిల్ మంజూరు చేసింది. గతంలో ...

జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై సుప్రీంకోర్టు కీలక కామోంట్స్

జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై సుప్రీంకోర్టు కీలక కామోంట్స్

జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర హోదా కల్పించే ముందు అక్కడి ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ...

రెజ్లర్ సుశీల్ కుమార్‌కు షాక్: బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

రెజ్లర్ సుశీల్ కుమార్‌కు షాక్: బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

భారత ప్రముఖ రెజ్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హత్య కేసులో నిందితుడైన సుశీల్‌కు గత మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ...