విశాఖ సిటీ (Visakha City) లో ఓ అనుమానాస్పద (Suspicious) వ్యక్తి (Person)హల్ చేశాడు. భారత్-పాక్ (India – Pakistan) మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో అతని కదలికలు తీవ్ర ఆందోళన కలిగించేలా ఉండడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. దేశంలో దాడులు జరిగే ప్రాంతాలను మూడు కేటగిరీలుగా విభజించగా, విశాఖ కేటగిరీ-2లో ఉంది. దీంతో అతని చర్యలు సైతం స్థానికులను షాక్కు గురిచేసేలా ఉండడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
వివరాల్లోకి వెళితే.. విశాఖ సిరిపురం జంక్షన్ (Siripuram Junction) వద్ద సూట్ వేసుకొని తిరుగుతూ ఓ వ్యక్తి హంగామా చేశాడు. అటు ఇటు తిరుగుతూ ఫొటోలు తీస్తూ తిరుగుతున్న ఫొటోలు (Photos) తీస్తున్నాడని, అతని ఫొటోలు, ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సిరిపురం జంక్షన్ వద్ద హల్చల్ చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఆ వ్యక్తి ఎవరూ అని తెలుసుకునే పనిలో పడింది.

సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో దాడికి అవకాశం ఉన్న నగరాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించింది. ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే అందుబాటులో ఉన్న పోలీసులకు, సాయుధ బలగాలకు సమాచారం అందించాలని సూచించింది. విశాఖలో అనుమానాస్పద వ్యక్తిపై సమాచారం అందుకున్న పోలీసులు అతను ఎవరో కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. విశాఖతో సంబంధం లేని వ్యక్తా.. లేక పబ్లిసిటీ స్టంట్ కోసం ఆకతాయి అత్యుత్సాహం ప్రదర్శించి ఉండవచ్చా..? అనే అనుమానాలు సైతం రేకెత్తుతున్నాయి.