విజయనగరం (Vizianagaram) జిల్లా సాలూరు (Salur) మండలంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.., కందులపథం పంచాయతీ చిన్నవలస (Chinnavalasa) గ్రామానికి చెందిన ఐశ్వర్య (Aishwarya) (20) చీపురువలస (Cheepuruvalasa) సమీపంలోని జీడి తోట (Cashew Orchard) లో ఉరివేసుకొని శుక్రవారం మృతిచెందినట్లు గుర్తించారు. తమ కుతూరు మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు సాలూరు రూరల్ ఎస్సై నరసింహమూర్తి (Narasimhamurthy) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
యువకుడిపై అనుమానం.. పోలీసులు గాలింపు
కాగా, చిన్నవలస గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో మృతురాలు ఐశ్వర్యను వేధించేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐశ్వర్య మృతికి ఆ యువకుడే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు మరింత సమాచారం కోసం కుటుంబ సభ్యుల నుండి వివరాలు తెలుసుకున్న అనంతరం కేసు విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.