ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టండి

ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టండి

కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష అనేది సున్నితమైన అంశమని సుప్రీంకోర్టు (Supreme Court) అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ద్విస‌భ్య ధర్మాసనం, విద్యార్థులపై జరుగుతున్న కుల వివక్షను రూపుమాపేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ (UGC)కి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు, అన్ని విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టేలా సమర్థవంతమైన ముసాయిదాను రూపొందించాలి. 2012 నిబంధనల ప్రకారం, ఎన్ని సమానత్వ అవకాశ యూనిట్లు ఏర్పాటు చేశారో దాని సమాచారం అందజేయాలి. యూజీసీ, అన్ని యూనివర్సిటీల నుంచి కుల వివక్షకు సంబంధించిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యల వివరాలను సేకరించి అందించాలి అని సుప్రీం కోర్టు సూచించింది.

సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ నివేదిక ప్రకారం, 2004 నుంచి 50 మందికి పైగా విద్యార్థులు కుల వివక్ష కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారే ఉన్నారు. ఈ ఘటనలు గతంలో రోహిత్ వేముల, పాయల్ తాడ్వీ వంటి బాధితుల కేసులను గుర్తుకు తెస్తున్నాయి. సుప్రీంకోర్టు ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కనుగొనేందుకు యూనివర్సిటీలకు నిర్దిష్ట మార్గదర్శకాలను అందించాలని స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment