సునీతాకు వెల్‌కమ్ చెప్పిన డాల్ఫిన్స్‌.. వీడియో వైరల్

భూమి మీద‌కు తిరిగొచ్చిన సునీతా విలియ‌మ్స్‌

నాసా భారతీయ-అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) భూమి మీద అడుగుపెట్టిన తొలి క్షణాలే ఆసక్తికరంగా మారాయి. ఆమెను స్వాగతించేందుకు కేవలం శాస్త్రవేత్తలే కాకుండా సముద్ర జీవులు కూడా ముందుకొచ్చాయి. భూమికి చేరుకున్న క్యాప్సూల్ సముద్రంలో ల్యాండ్ కావడంతో, డాల్ఫిన్లు చుట్టూ తిరుగుతూ వినూత్నమైన దృశ్యాన్ని సృష్టించాయి. ఈ అపూర్వ క్షణాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సునీతా దాదాపు తొమ్మిది నెలల తర్వాత భూమి మీద అడుగుపెట్టారు. క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చిన ఆమె చిరునవ్వులు చిందిస్తూ, హాయిగా అందరికీ అభివాదం చేశారు. అంతరిక్షంలో గడిపిన కాలానికి ఎలాంటి ప్రభావం లేకుండా ఆమె ఎంతో ఉల్లాసంగా కనిపించడం అందర్నీ ఆకట్టుకుంది.

నాలుగు వారాల ప్రయాణం.. తొమ్మిది నెలల నిరీక్షణ
గతేడాది జూన్ 5న, సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి ప్రయాణమయ్యారు. తొలుత వారంలోనే తిరిగి రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో ఈ ప్రయాణం తొమ్మిది నెలలకు పెరిగిపోయింది. చివరికి, అనుకున్నదానికంటే చాలా ఆలస్యంగా అయినా, భద్రంగా భూమికి చేరుకోవడం సునీతా అభిమానులకు ఆనందాన్ని తెచ్చింది. ఆమె సురక్షితంగా తిరిగి రావడంతో ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, సామాన్య ప్రజలు ఆమెకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేస్తూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment