సునీతా విలియమ్స్‌కి భారతరత్న ఇవ్వాలి.. – మమతా బెనర్జీ డిమాండ్

సునీతా విలియమ్స్‌కి భారతరత్న ఇవ్వాలి.. – మమతా బెనర్జీ డిమాండ్

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌కి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఎక్స్ (ట్విట్టర్)లో పె్టిన పోస్టులో సునీతాను భారత కుమార్తెగా అభివర్ణిస్తూ అంతరిక్షంలో తొమ్మిది నెలల పాటు అంకిత భావంతో చేసిన పరిశోధనలను ప్రశంసించారు.

పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో కూడా సభ్యులు సునీతా విలియమ్స్‌కు అభినందనలు తెలియజేశారు. మమతా బెన‌ర్జీ మాట్లాడుతూ, “సునీతా 286 రోజుల పాటు అంతరిక్షంలో అద్భుతమైన సేవలందించింది. ఆమెకు భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఉంది” అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

సాంకేతిక లోపం..
సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్ కూడా మొదట వారం రోజుల్లో భూమికి తిరిగి రావాల్సి ఉండగా, సాంకేతిక లోపం కారణంగా 286 రోజుల పాటు అంతరిక్షంలో ఉండిపోయారు. చివరకు బుధవారం భూమ్మీద అడుగుపెట్టిన సునీతా హాయ్ చెబుతూ ఉల్లాసంగా కనిపించారు. అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా ముగియడం పట్ల మమతా బెనర్జీ ఆనందం వ్యక్తం చేస్తూ, రెస్క్యూ బృందాన్ని కూడా ప్రశంసించారు. సునీతా విజయగాథ‌కు దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరి, కేంద్రం ఈ డిమాండ్‌ను ఎలా స్పందిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment