విద్యాబుద్ధులు నేర్పే క్రమంలో విద్యార్థులను ఉపాధ్యాయులు సున్నితంగా దండించడం అనేది సహజంగా స్కూల్, కాలేజీల్లో జరుగుతుంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా.. విద్యార్థులను మందలించే సంస్కృతి కూడా కనుమరుగవుతోంది. కానీ, విశాఖ సీన్ రివర్స్ అయ్యింది. ఉపాధ్యాయురాలును విద్యార్థిని ఏకంగా చెప్పుతో కొట్టిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విశాఖపట్నం (Visakhapatnam)లోని ఓ ప్రైవేట్ ఇంటర్ కళాశాలలో టీచర్ (Teacher), విద్యార్థిని (Student) మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొబైల్ ఫోన్ తీసుకుందని ఆరోపణ చేస్తూ, ఆ ఫోన్ ధర రూ.12,000 అని చెబుతూ విద్యార్థిని టీచర్పై అసభ్యకర పదజాలంతో దూషణలకు దిగింది.
“ఫోన్ ఇస్తావా? లేక చెప్పుతో కొట్టమంటావా?” అంటూ టీచర్ను ప్రశ్నించిన విద్యార్థిని, వెంటనే చెప్పు తీసి దాడికి దిగింది. టీచర్ “ఇవ్వను” అని స్పష్టంగా చెప్పగానే ఆ విద్యార్థిని కోపంతో టీచర్పై దాడి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇదేమి విద్యార్థి లోకం? టీచర్లకు గౌరవం లేకుండా పోతుందా?” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు విద్యార్థిని కఠినంగా శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
సెల్ఫోన్ తెచ్చిన తంట..
— Telugu Feed (@Telugufeedsite) April 22, 2025
టీచర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని.. వీడియో వైరల్#AndhraPradesh #viralvideo #Vizag #Mobile pic.twitter.com/Q8Tux3kjt7