ఏపీ డీఐజీ రాస‌లీల‌లు.. ప్ర‌శ్నించిన భార్య‌పై దాడి

ఏపీ డీఐజీ రాస‌లీల‌లు.. ప్ర‌శ్నించిన భార్య‌పై దాడి

బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న ఓ ఆఫీస‌ర్ రాస‌లీల‌లు బ‌య‌ట‌కొచ్చాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ విభాగంలో డిప్యూటీ ఇనిస్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (డీఐజీ) హోదాలో ఉన్న అధికారి వికృత చేష్ట‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. డీఐజీ కిర‌ణ్ ప‌లువురు అమ్మాయిల‌తో అక్ర‌మ సంబంధాలు పెట్టుకొని, క‌ట్టుకున్న భార్య‌ను చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తున్న ఉదంతం వెలుగుచూసింది. ఈ ఘ‌ట‌న‌పై అరండ‌ల్ పేట పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

వివ‌రాల్లోకి వెళితే..
స్టాంప్స్ అంటే రిజిస్ట్రేషన్ డీఐజీగా ఉన్న‌ కిరణ్ ప‌లువురు మ‌హిళ‌ల‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడు. కిర‌ణ్ బాగోతం తెలిసిన భార్య నిల‌దీసింది. దీంతో గ‌త కొంత‌కాలంగా చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తున్నాడు. వేరే మహిళలతో ఉన్న ఫొటోలు భార్యకు పంపించి మానసిక వేధింపులకు పాల్ప‌డుతున్నాడు. కిర‌ణ్ అక్ర‌మ సంబంధాల‌పై ప్ర‌శ్నించ‌గా, భార్యాబిడ్డలను చిత‌క బాదాడు. డీఐజీ కిర‌ణ్ భార్య ఎల్ఐసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది.

గత రాత్రి ఇదే విష‌య‌మై భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య వివాదం త‌లెత్తింది. దీంతో ఆవేశంతో డీఐజీ కిర‌ణ్ భార్యను చితకబాదాడు. భర్త దాడిలో స్పృహ కోల్పోయిన భార్యను ఆమె బంధువులు ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అనంత‌రం గుంటూరు అరండల్ పేట స్టేషన్‌లో భర్త కిర‌ణ్‌పై భార్య ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. కాగా, భార్యకు అండగా వచ్చిన బంధువులపై అట్రాసిటి కేసు పెడతానని డీఐజీ కిర‌ణ్ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment