సూపర్స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), ప్రముఖ దర్శకుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘SSMB29’ గురించి హైప్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కీలక పాత్ర పోషిస్తుందనే వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి.
ఒడిశా టూర్.. ‘SSMB29′ కోసమేనా?
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా, ప్రియాంక చోప్రా తన ఇన్స్టాగ్రామ్లో ఓ స్టైలిష్ ఫొటోను షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. విమానం కిటికీ నుండి తీసిన ఈ ఫొటో చూసిన వెంటనే ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహం మొదలైంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రియాంక ‘SSMB29′ షూటింగ్ కోసమే ఒడిశా వెళ్లిందని తెలుస్తోంది. అయితే, చిత్రబృందం నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.