సోనియాగాంధీకి అస్వస్థత.. ఆస్ప‌త్రిలో చేరిక‌

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) స్వల్ప అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని సిమ్లా (Shimla)లో ఉన్నారు. అక్కడి ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ (Indira Gandhi Medical College) ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ, ప్రాథమికంగా చిన్నపాటి అస్వస్థత కారణంగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెసు శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment