ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 25వ రోజుకు చేరింది. ఈ ప్రక్రియలో అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, అధికారులు వెనుకడుగు వేయడం లేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగంగా కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం టన్నెల్లో రోబోల సహాయంతో తవ్వకాలు చేపడుతున్నారు. NDRF, SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ప్రమాద స్థలంలో మట్టి, నీటి ఊట, టిబియం అవశేషాలు ప్రధాన ఆటంకంగా మారాయి. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలను ముమ్మరం చేశారు. డీ వాటరింగ్, టిబియం మిషన్ కటింగ్ పనులు నిరంతరాయంగా సాగుతున్నాయి. ఇటీవల జరిగిన పరిశోధనలో ఒక మృతదేహాన్ని వెలికితీశారు.
బాధిత కుటుంబాల నిరీక్షణ
టన్నెల్ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఇంకా ఏడుగురి మృతదేహాలు వెలికి తీయకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రెస్క్యూ మిషన్ పూర్తి అయ్యే వరకు మృతుల కుటుంబాలకు ఎదురు చూపులు తప్పేలా లేవు.