మార్క్ శంక‌ర్‌ను కాపాడిన న‌లుగురూ భార‌తీయులే..

మార్క్ శంక‌ర్‌ను కాపాడిన న‌లుగురూ భార‌తీయులే..

సింగపూర్‌ (Singapore) లోని ఓ స్కూల్‌ (School)లో భారీ అగ్నిప్రమాదం (Major Fire Accident) జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) తీవ్రంగా గాయ‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఇటీవ‌ల డిశ్చార్జ్ అయిన విష‌యం తెలిసిందే. కాగా, అగ్నిప్ర‌మాదం నుంచి చిన్నారుల‌ను రక్షించిన రెస్క్యూ సిబ్బంది (Rescue Personnel) కి ఆ దేశ ప్రభుత్వం ఘనంగా సన్మానం (Honoured) చేసింది. స్కూల్ భవనంలో జరిగిన ప్రమాదంలో మొత్తం 22 మంది విద్యార్థులను సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ప్రాణాలను పణంగా పెట్టి చూపిన ధైర్యానికి, చాకచక్యానికి గుర్తింపుగా ఈ సత్కారం చేపట్టినట్టు సింగపూర్ ప్రభుత్వం పేర్కొంది. ఆ భ‌వ‌నంలోని పిల్ల‌ల‌ను ర‌క్షించిన న‌లుగురూ భార‌తీయులేన‌ని (Indians) సింగ‌పూర్ ప్ర‌భుత్వం తేల్చింది. వారు.. ఇందర్‌జిత్ సింగ్, సుబ్రమణియన్ శరణ్‌రాజ్, నాగరాజన్ అన్బరసన్, శివసామి విజయరాజ్‌లు అని, స్థానికంగా ఉన్న ఫైర్ సేఫ్టీ (Fire Safety) విభాగంలో కార్మికులుగా ప‌నిచేస్తున్నారని తెలిపింది. ఇదే ప్రమాదంలో మార్క్ శంకర్ కూడా చికిత్స పొందగా, ఇటీవలే ఇంటికి చేరుకున్నాడని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment