టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ‘తెలుసు కదా’ మూవీ టీమ్ స్పెషల్ విషెస్ చెప్పింది. ప్రస్తుతం సిద్ధూ, రాశి ఖన్నా, శ్రీనిధిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’ సినిమాపై మంచి అంచనాలున్నాయి. రొమాంటిక్ డ్రామా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నీరజ కోన దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
సిద్దూ బర్త్డే సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఫ్యాన్స్ ఈ పోస్టర్ను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కూడా బిగ్ హిట్ అవుతుందనే విశ్వాసం పెరుగుతోంది. టిల్లు సినిమా తరువాత టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్దూ జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్ తో అభిమానులకు మరింత దగ్గరయ్యారు. సిద్దూ యాటిట్యూడ్కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం తెలుసు కదా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.