టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు సారథిగా వరుసగా రెండోసారి నిరాశ ఎదురైంది. కేవలం 10 రోజుల వ్యవధిలో అతను రెండు ఫైనల్స్లో ఓటమిని చవిచూశాడు.
జూన్ 3న జరిగిన ఐపీఎల్ 2025 (IPL 2025) ఫైనల్లో, శ్రేయస్ కెప్టెన్గా ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు (Punjab Kings Team) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) చేతిలో ఓడిపోయింది. తాజాగా, ముంబై టీ20 ప్రీమియర్ లీగ్ 2025 (Mumbai T20 Premier League 2025)లో భాగంగా గురువారం జరిగిన ఫైనల్లోనూ శ్రేయస్ సారథ్యం వహించిన సోబో ముంబై ఫాల్కన్స్ టీమ్ (SoBo Mumbai Falcons Team) ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ (Mumbai South Central Maratha Royals) చేతిలో పరాజయం (Defeat) పాలైంది.
శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన కెప్టెన్సీ (Captaincy)తో 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టును ఐపీఎల్ ఫైనల్(Final) చేర్చాడు. అయితే, ఐపీఎల్ 2025 ఫైనల్లో కేవలం 6 పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడి, ట్రోఫీని తృటిలో కోల్పోయారు. ఇప్పుడు ముంబై ప్రీమియర్ లీగ్లోనూ అదే నిరాశను (Disappointment) ఎదుర్కొన్నారు. ఈ రెండు ఫైనల్స్లోనూ శ్రేయస్ బ్యాటింగ్లోనూ విఫలమయ్యాడు. ఐపీఎల్ 2025 ఫైనల్లో 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా, ముంబై ప్రీమియర్ లీగ్ ఫైనల్లో 17 బంతుల్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. శ్రేయస్ వరుసగా రెండు ఫైనల్స్లో ఓడిపోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ముంబై ప్రీమియర్ లీగ్ ఫైనల్ వివరాలు:
ముందుగా బ్యాటింగ్ చేసిన సోబో ముంబై ఫాల్కన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 157 పరుగులు చేసింది. మయురేష్ తండెల్ (50 నాటౌట్), హర్ష్ అగవ్ (45 నాటౌట్) రాణించారు. వైభవ్ మాలి రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసి విజయం సాధించింది. చిన్మయ్ రాజేష్ సుతార్ (53), అవైస్ ఖాన్ నౌషధ్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కార్తిక్ మిశ్రా, యష్ డిచోల్కర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.