శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలకు రూ. 60 కోట్ల మోసం కేసులో లుకౌట్ నోటీసులు

శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలకు రూ. 60 కోట్ల మోసం కేసులో లుకౌట్ నోటీసులు

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) మరియు ఆమె భర్త రాజ్ కుంద్రా (Raj Kundra) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ముంబై పోలీసులు వారిద్దరిపై లుకౌట్ (Lookout) నోటీసులు జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కొఠారి (Deepak Kothari)ని రూ. 60 కోట్ల వరకు మోసం (Cheated) చేశారనే ఆరోపణలతో గతంలో వారిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు.

విచారణ వేగవంతం, అరెస్ట్ భయం
ఈ కేసులో పోలీసులు ఇప్పటికే సదరు కంపెనీ ఆడిటర్‌ను విచారించారు. శిల్పా శెట్టి దంపతులు కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో, వారు దేశం విడిచి పారిపోకుండా నిరోధించడానికి లుకౌట్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు.

పోలీసుల ప్రకారం, ఈ కేసు ఆగస్టు 14న నమోదు అయినప్పటి నుంచి, శిల్పా శెట్టి దంపతులు తరచుగా విదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు వారి ట్రావెల్ హిస్టరీ (Travel History)ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే, త్వరలోనే వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసు బాలీవుడ్ వర్గాల్లో మరియు వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment