టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన కొత్త జీవితం ప్రారంభించానని ప్రకటించుకున్నారు. తన ప్రియురాలు సోఫీ షైన్ను అధికారికంగా పరిచయం చేస్తూ, ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. “My Love” అంటూ వారి మధ్య ఉన్న ప్రేమను అఫీషియల్గా అనౌన్స్ చేశారు. క్యాప్షన్తోపాటు లవ్ ఎమోజీ కూడా జతచేశారు. సోఫీ కూడా ఇన్స్టా ద్వారా శిఖర్ ధావన్ చేసిన ఫొటోనే అదే క్యాప్షన్తో పోస్ట్ చేసింది.
ఈ పోస్టుకు భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్తో పాటు సోఫీ కూడా లైక్ చేయడం నెట్టింట్లో హైలైట్గా నిలిచింది. ఫ్యాన్స్ మాత్రం ఈ జంటపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే వారి సంబంధం గురించి గాసిప్స్ వచ్చాయి కానీ, ఇదే మొదటి సారి ధావన్ అధికారికంగా వెల్లడించడం గమనార్హం.
శిఖర్ ధావన్ యూఏఈలో సోఫీ షైన్ను కలిసినట్లు తెలుస్తోంది. ఈ జంట గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో కలిసి కనిపించారు. శిఖర్, సోఫీ సోషల్ మీడియా పోస్ట్తో తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు.ఇక త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారన్న ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి.