హైదరాబాద్కు చెందిన రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇకపై వియత్నాం రాజధాని హనోయ్ వరకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కొత్త అంతర్జాతీయ రూట్ను జీఎంఆర్ (GMR) అధీనంలో ఉన్న విమానాశ్రయం బుధవారం అధికారికంగా ప్రారంభించింది. జీఎంఆర్ గ్రూప్ సీఈవో ప్రదీప్ ఫణీకర్ (Pradeep Panicker) వెల్లడించిన వివరాల ప్రకారం.. వియత్నాం ఎయిర్లైన్స్ (Vietnam Airlines) ఈ కొత్త సర్వీసును ప్రారంభించింది. ప్రతి వారం ఆదివారం, బుధవారం, శుక్రవారం.. ఈ మూడు రోజులు ఈ విమాన సేవలు కొనసాగనున్నాయి. ఇది విమాన ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతానికి హనోయ్ వెళ్లే ప్రయాణికుల సంఖ్యలో గణనీయంగా వృద్ధి కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ నూతన రూట్ను ప్రారంభించామని జీఎంఆర్ తెలిపింది. అంతేకాకుండా భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీసులను విస్తరించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.
విమానాశ్రయం అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు జీఎంఆర్ నిబద్ధతతో ఉన్నట్టు ప్రదీప్ పణీకర్ తెలిపారు. దేశీయ సర్వీసులతోపాటు అంతర్జాతీయ కనెక్టివిటీ పెంపు దిశగా చర్యలు కొనసాగుతాయని చెప్పారు. ఈ రూట్ ప్రారంభం ద్వారా భారత్-వియత్నాం మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.