సెకీ ఒప్పందాలపై సీఎం చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నలు సంధించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్లో కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
షర్మిల ట్వీట్లో ఏముందంటే..
గత “జగన్ తప్పు చేస్తే.. సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలంటున్న వైసీపీ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు ఏమంటారు చంద్రబాబు అని ప్రశ్నించారు. మౌనంగా ఉంటున్నారు అంటే అదానీ ఒప్పందం అక్రమం కాదని ఒప్పుకున్నారా ? సక్రమం కాబట్టే రద్దు చేయలేదు అని చెప్పకనే చెప్తున్నారా ? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం తప్పా.. మీ ఆరోపణల్లో నిజం లేదంటారా ? పోనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది కూడా అంత తూచ్ కిందనేనా ? అదానీ జగన్ నే కాదు మిమ్మల్ని కూడా కొన్నారని చెప్తారా ? అని చంద్రబాబును వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
ముడుపులు అందాయా బాబూ..?
ముడుపులు వాళ్ళకేనా.. మీకు అందాయనే నిజం అంగీకరిస్తున్నారా ? అందుకేనా ACB ని పంజరంలో బంధించారు ? ఇందుకేనా అదానీపై ఒక్క మాటకూడా లేదు ? ఇదేనా బాబు మీ 40 ఏళ్ల రాజకీయం ? 1750 కోట్ల లంచాలు తీసుకొని, రాష్ట్ర ప్రజల నెత్తిన 1.50 లక్షల కోట్ల భారం వేసి, అదానీకి మేలు చేసే డీల్ పై మీరు మౌనంగా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉద్యమాన్ని ఆపదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, న్యాయబద్ధంగా కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా మేము సిద్ధం. ఇప్పటికైనా డీల్ రద్దు చేసి.. 1750 కోట్ల ముడుపుల పై దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం“ అని షర్మిల ట్వీట్ చేశారు.