కిడ్నాప్‌తో ముదిరిన వివాదం.. శాతవాహన కాలేజ్ కూల్చివేత

కిడ్నాప్‌తో ముదిరిన వివాదం.. శాతవాహన కాలేజ్ కూల్చివేత

విజయవాడ (Vijayawada)లోని శాతవాహన కాలేజ్ (Satavahana College) కూల్చివేత‌ (Demolition) ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కూల్చివేతల వెన‌క అధికార పార్టీ (Ruling Party)కి చెందిన రాజ‌కీయ నేత హ‌స్తం ఉంద‌ని, అందుకే రాత్రికి రాత్రి జేసీబీల‌తో (JCBs) కాలేజీ కూల్చివేత‌ల‌కు తెగ‌బ‌డ్డార‌ని తెలుస్తోంది. కాలేజ్ ప్రిన్సిపల్ కిడ్నాప్ (Principal Kidnap) ఘటనతో మొదలైన వివాదం, ఇప్పుడు కాలేజ్ భవనాల కూల్చివేతతో మరింత ముదిరింది. ఈ ఘటనలు విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మారింది. అలాగే స్థానిక రాజకీయాలలో ఉద్రిక్తతను పెంచాయి.

కిడ్నాప్ ఘటనతో మొదలైన వివాదం
మే 30న విజయవాడలోని బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ వద్ద (The Address Mall) శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ (Satavahana College Principal) వంకాయలపాటి శ్రీనివాస్‌ (Vankayalapati Srinivas)‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని సోషల్ మీడియా పోస్టుల ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్ శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)(TDP) ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ (Alapati Rajendraprasad) ఈ కిడ్నాప్‌కు కారకుడని ఆరోపించారు. భూ వివాదంలో భాగంగా తన తండ్రితో సంతకాలు చేయించేందుకు ఆలపాటి బెదిరించారని, కాల్ రికార్డింగ్స్ మరియు వాట్సాప్ చాట్స్ తన వద్ద ఉన్నాయని శ్రీనివాస్ అన్నారు. ఈ ఆరోపణలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో తీవ్ర చర్చను రేకెత్తించాయి.

కాలేజ్ భవనాల కూల్చివేత
ఈ కిడ్నాప్ ఘటన తర్వాత, శాతవాహన కాలేజ్ స్థలంలో బోయపాటి శ్రీనివాస అప్పారావు (Boyapati Srinivasa Apparao) అనే వ్యక్తి బోర్డులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అనంతరం, గుర్తు తెలియని వ్యక్తులు ప్రొక్లెయిన్లతో కాలేజ్ భవనాలను కూల్చివేశారు. ఈ కూల్చివేతల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కూల్చివేతలను అడ్డుకున్నారు. అయినప్పటికీ, కాలేజ్‌కు సంబంధించిన కీలక రికార్డులు శిథిలాల కింద చిక్కుకున్నాయని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితంగా మారిందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

రాజకీయ ఆరోపణలు
ఈ ఘటనలు రాజకీయ రంగంలో తీవ్ర చర్చను రేకెత్తించాయి. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఈ కిడ్నాప్ మరియు కూల్చివేతల వెనుక ఆయన చేయి ఉందని బాధిత యాజ‌మాన్యం, ప‌లువురు విద్యావేత్త‌లు ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు విద్యాసంస్థలను కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది.

శాతవాహన కాలేజ్ వివాదం విజయవాడలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది. అధికార పార్టీకి చెందిన నేత విద్యా సంస్థ‌ల ప్రిన్సిప‌ల్‌ను కిడ్నాప్ చేయ‌డం, ఆ త‌రువాత ఆ విద్యా సంస్థ‌ల‌ను కూల్చివేయ‌డం ఏంట‌ని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ ప‌నితీరును ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డేసింది. పోలీసులు ఏం చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు, రాజ‌కీయ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. కిడ్నాప్ చేసింది టీడీపీ ఎమ్మెల్సీ ఆల‌పాటి రాజా అని కాలేజీ ప్రిన్సిప‌ల్ శ్రీ‌నివాస్ తెలిపినా, ఎమ్మెల్సీని క‌నీసం విచారించారా..? అని నిల‌దీస్తున్నారు. అధికార పార్టీ నేత‌లు ఆగ‌డాల‌పై పోలీసులు స్పందించ‌రా..? అని ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. మ‌రి దీనిపై అధికార తెలుగుదేశం, ఏపీ పోలీస్ శాఖ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment