సంక్రాంతి పండగ సినిమా అభిమానులకు పండుగగా మారింది. మూడు ప్రధాన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ బరిలో నిలిచాయి టాలీవుడ్ స్టార్ హీరో ముగ్గురు సంక్రాంతి పండుగ పూట తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జనవరి 10న రామ్చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ విడుదలైంది. జనవరి 12న బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వం వహించిన డాకు మహారాజ్ విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి రోజున విడుదలైంది.
మొదట గేమ్ ఛేంజర్ పై ఆశలు పెట్టుకున్నప్పటికీ, మిక్స్డ్ టాక్ కారణంగా కలెక్షన్లు తగ్గిపోయాయి. డాకు మహారాజ్ కాస్త మెరుగైన ప్రతిస్పందన పొందగా, సంక్రాంతికి వస్తున్నాం మాత్రం అద్భుతమైన టాక్తో దూసుకుపోయింది.
బుక్ మై షో ట్రాకింగ్ వివరాలు
బుక్ మై షో సంస్థ ఈ మూడు చిత్రాలకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ను ట్రాక్ చేసింది. ఒక గంటలో ఎక్కువ టికెట్లు అమ్ముడైన వివరాల ప్రకారం:
- గేమ్ ఛేంజర్: 1,810 టికెట్లు
- డాకు మహారాజ్: 3,380 టికెట్లు
- సంక్రాంతికి వస్తున్నాం: 8,390 టికెట్లు
టాప్ స్థానం సంక్రాంతికి వస్తున్నాం సినిమాకే..
ఈ డేటా ప్రకారం, సంక్రాంతికి వస్తున్నాం స్పష్టంగా టాప్ స్థానాన్ని దక్కించుకుంది. ప్రేక్షకుల మన్ననలు అందుకుని, ఈ చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచింది. డాకు మహారాజ్ రెండో స్థానంలో ఉండగా, గేమ్ ఛేంజర్ చివరి స్థానంలో నిలిచింది.