ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాల్లో మొదలైన పుష్ప సినిమా (Pushpa Movie) డైలాగ్ (Dialogue) బ్యానర్ల జోరు తెలంగాణ రాజకీయాలను (Telangana Politics) తాకింది. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పటాన్చెరు (Patancheru) నియోజకవర్గంలో బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో జరిగిన రైతు మహాధర్నా (Mass Protest) రాజకీయ వేడిని రగిల్చింది. రైతు భరోసా (Farmer Support) నిధుల్లో(Funds) రైతులకు మోసం జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్నాలో ‘2028లో రప్పా రప్పా (Rappa (Rappa)) 3.0 లోడింగ్’ అనే ప్లకార్డులు ప్రదర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రదర్శించిన ‘పుష్ప 2’ సినిమా డైలాగ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఈ ‘రప్పా రప్పా’ డైలాగ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పర్యటనలో ప్రదర్శించడంతో రాజకీయ వేడి రాజుకుంది. ఈ డైలాగ్పై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు జగన్ స్పందిస్తూ, “సినిమా డైలాగ్లు ప్రదర్శించినా కేసులు పెడుతారా..? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా..? అని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి స్థాయి నుంచి టీడీపీ(TDP) కార్యకర్తల వరకు దాన్ని తప్పుబట్టారు. జగన్ సుదీర్ఘ ప్రెస్మీట్లో లెక్కలతో సహా వివరించిన ఏపీ ఆర్థిక పరిస్థితిని తప్పుదోవ పట్టించేందుకు రప్పా.. రప్పా డైలాగ్ను పట్టుకొని రాజకీయం చేశారనే ఆరోపణలున్నాయి.
కాగా, ఏపీలో జగన్ నోట వచ్చిన రప్పా రప్పా డైలాగ్ వీడియోను విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం రప్పా రప్పా వేడి తెలంగాణను తాకింది. “2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది.. కాంగ్రెస్ను ఓడిస్తుంది” అనే సందేశంతో ‘రప్పా రప్పా 3.0’ ప్లకార్డులు ధర్నాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం పుష్ప సినిమా డైలాగ్ పోస్టర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.