సంగారెడ్డి జిల్లా ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ కొనిస్తామని నమ్మించి ఇద్దరు యువకులు తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. చిన్నారి తీవ్ర రక్తస్రావంతో కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. వెంటనే బాలికను సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
సీసీ కెమెరాల్లో నిందితుల దృశ్యాలు నమోదయ్యాయి. స్థానికులు వారిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. కాలనీ వాసుల ప్రకారం, ఆ యువకులు మద్యం మత్తులో ఉన్నారు. ఈ దారుణ ఘటనపై కాలనీ వాసులు ఆస్పత్రి ఎదుట తీవ్ర ఆందోళనకు దిగారు. నిందితులపై కఠినమైన శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు.