పండగ (Festival) పూట కరెంట్ (Electricity) లేకపోవడంతో ప్రజలంతా రోడ్డెక్కారు. పండగ వేళ బంధువుల ముందు పరువుపోయిందని గగ్గోలు పెట్టారు. పార్వతీపురం మన్యం (Parvathipuram Manyam) జిల్లా సాలూరు (Salur) పట్టణంలో గత నాలుగు రోజులుగా నెలకొన్న గాఢ అంధకారం స్థానిక ప్రజలలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఎడతెరపి లేని విద్యుత్ కోతలతో విసిగిపోయిన సాలూరు ప్రజలు, శ్యామలాంబ అమ్మవారి ఉత్సవాల సమయంలో కూడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో చిమ్మచీకట్లో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఈ ఘటనలు స్థానిక విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని, వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది.
నిరసనల నేపథ్యం
సాలూరు పట్టణంలో శ్యామలాంబ (Shyamalaamba) అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో, గత నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా (Power supply) లో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విద్యుత్ కోతలు స్థానికుల రోజువారీ జీవనాన్ని దెబ్బతీశాయని మండిపడ్డారు. పండుగ సమయంలో విద్యుత్ కోతలు బంధువుల ముందు తమ పరువు తీసిందని, ప్రభుత్వం తమను మోసం చేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సాలూరు ప్రజలు కొవ్వొత్తులతో నిరసనకు దిగారు.. మంత్రి సంధ్యా రాణిపై “డౌన్ డౌన్” (Down Down) నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అధికారుల నిర్బంధం..
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సంధ్యారాణి అధికారంలోకి వచ్చాక తమను అంధకారంలోకి నెట్టిందని స్థానిక మహిళలు మండిపడ్డారు. సంధ్యారాణిని గెలిపించి తప్పుచేశామని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆగ్రహానికి గురైన ప్రజలు స్థానిక విద్యుత్ శాఖ (Local Electricity Department) అసిస్టెంట్ ఇంజనీర్ (AE) నాగేశ్వరరావు (Nageswara Rao), అడిషనల్ డిప్యూటీ ఇంజనీర్ (ADE) రంగారావు (Ranga Rao) లను ప్రజలు ఒక గదిలో నిర్బంధించారు. దీంతో పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రజల నిరసన కార్యక్రమం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను అదుపు చేయడంలో విఫలమయ్యారు.
వీడియోలు వైరల్..
నాలుగు రోజులుగా ప్రజలను గాఢ అంధకారంలోకి నెట్టిన ప్రభుత్వంపై, విద్యుత్ శాఖ అధికారులపై ప్రజలు మండిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సాలూరు విద్యుత్ కోతలపై విస్తృత చర్చ జరుగుతోంది. “పండుగ సమయంలో కూడా విద్యుత్ సరఫరా లేకపోవడం అవమానకరం” అని కొందరు ప్రభుత్వంపై మండిపడుతుండగా, మరికొందరు నాలుగు రోజులుగా విద్యుత్ లేకుండా ప్రభుత్వ పెద్దలు ఉండగలరా..? ప్రభుత్వ అధికారులు జీవించగలరా..? అని ప్రశ్నిస్తున్నారు. సాలూరు ప్రజల నిరసనలు స్థానిక సమస్యలను రాష్ట్రవ్యాప్త చర్చగా మార్చాయి, విద్యుత్ శాఖపై ఒత్తిడిని పెంచాయి.
సాలూరులో శ్యామలాంబ అమ్మవారి పండక్కి తప్పని కరెంటు కష్టాలు
— Telugu Feed (@Telugufeedsite) May 21, 2025
ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది బంధువుల ముందు పరువు పోయిందని గగ్గోలు పెడుతూ కొవ్వొత్తులతో నిరసన
మంత్రి సంధ్యా రాణి Down Down అంటూ నినాదాలు#AndhraPradesh #Saluru #PowerCut pic.twitter.com/iNazxaXpcf








