రష్యా-అమెరికా కీలక భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ప‌డ‌నుందా?

రష్యా-అమెరికా కీలక భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ప‌డ‌నుందా?

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందా? ఈ ప్రశ్నకు త్వ‌ర‌లో సమాధానం దొరకే అవకాశముంది. మూడేళ్లు పూర్తి చేసుకున్న ఈ యుద్ధం చివరి అంకానికి చేరుకుంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. నేడు సౌదీ అరేబియాలోని రియాద్ వేదికగా అమెరికా-రష్యా విదేశాంగ మంత్రులు భేటీ జ‌ర‌గ‌నుంది.

ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రష్యా తరపున కీలక ప్రతినిధులు పాల్గొంటారు. ప్రధానంగా, ఉక్రెయిన్‌లో శాంతిని ఎలా నెలకొల్పాలి? రెండు దేశాల మధ్య సంబంధాలను ఎలా మెరుగుపర్చుకోవాలి? అనే అంశాలపై చర్చలు జరగనున్నాయి.

ఈ భేటీ ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య భవిష్యత్ చర్చలకు మార్గం సుగమం చేయనున్నారు. అయితే, ఈ సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ పాల్గొనడం లేదు. సౌదీలో జరిగే చర్చల్లో ఎలాంటి నిర్ణయాన్నీ తమ దేశం ఆమోదించదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఉక్రెయిన్‌ను భాగ‌స్వామ్యం చేయ‌కుండా ఏ శాంతి చర్చలూ ఫలప్రదంగా ఉండవని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీని వల్ల జెలెన్‌స్కీ అబూధాబీ నుంచి రియాద్ వెళ్లే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చర్చలు ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి నిజంగా ముగింపు పలుకుతాయా? లేదా మరో నిరీక్షణ మాత్రమేనా? త్వరలోనే స్పష్టత రానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment