ఆర్టీసీ బస్సు (RTC Bus) లో ఓ తాగుబోతు (Drunkard) వీరంగం సృష్టించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) లో కలకలం రేపింది. మద్యం (Alcohol) మత్తులో యువతులపై (Young Women) అసభ్యంగా ప్రవర్తించి, దాడికి కూడా తెగబడాడు. దీంతో యువతులు తిరగబడి ఆ తాగుబోతుకు బుద్ధిచెప్పారు. ఈ సంఘటన జిల్లాలోని నేరేళ్ల గ్రామ (Nerella Village) సమీపంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వేములవాడ నుంచి సిద్దిపేటకు వెళుతున్న ఆర్టీసీ బస్సులో సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద ఓ మద్యం సేవించిన వ్యక్తి ఎక్కాడు. బస్సు తంగళ్లపల్లి మండలం సారంపల్లి ప్రాంతం దాటుతున్న సమయంలోనే యువతులపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ, భౌతిక దాడికి (Physical Attack) కూడా పాల్పడ్డాడు. యువతులపై కాళ్లతో దాడి చేసి, జుట్టు లాగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే ఆ యువతులు భయపడకుండా వెంటనే అతడిపై ఎదురుదాడికి దిగారు. కాళ్లతో తన్నడంతో పాటు కర్రతో కొట్టి తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ (Driver) బస్సును ఆపి, నేరేళ్ల వద్ద ఆ వ్యక్తిని దింపేశాడు.
అయినా అక్కడి నుంచి వెళ్లకుండా మళ్లీ దూషణలు చేస్తూ వేధించడంతో యువతులు మరోసారి అతడిపై స్వయంగా దాడి చేశారు. ఓ అమ్మాయి కర్రతో కొట్టి (Girl Hit With a Stick) బుద్ధి చెప్పిన దృశ్యం సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయింది. ప్రయాణికులు తీసిన వీడియోలతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన నెటిజన్లు ఆ యువతుల ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నారు.