రోహిత్, కోహ్లి, జ‌డేజా రిటైర్మెంట్‌.. నిజ‌మెంత‌?

రోహిత్, కోహ్లి, జ‌డేజా రిటైర్మెంట్‌.. నిజ‌మెంత‌?

టీమిండియా అభిమానుల్లో కొత్త ఆందోళన మొద‌లైంది. సీనియ‌ర్ ప్లేయ‌ర్‌, ఆల్‌రౌండ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న త‌రువాత మ‌రో ముగ్గురు కీల‌క క్రికెట‌ర్లు త‌మ రిటైర్మెంట్‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌బోతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.

టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ గురించి తాజాగా చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ ‘క్రిక్బజ్’ ప్రకారం, వచ్చే ఏడాది జరిగే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ముగిసే నాటికి వీరి అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు ఉండొచ్చని అంచనా.

సీనియర్ల రిటైర్మెంట్..
‘క్రిక్బజ్’ కథనంలో పేర్కొన్నట్లు, భారత జట్టు పెద్ద మార్పులను ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది. ‘‘అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, సీనియర్లు తమ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. 2024లో భారత జట్టు పూర్తిగా కొత్తగా కనిపించనుంది’’ అని ఆ కథనం వెల్లడించింది. అయితే, దీనిపై ఆటగాళ్ల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, కోహ్లీ, రోహిత్‌, జ‌డేజా అభిమానుల్లో ఆందోళ‌న మొద‌లైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment