భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆసిస్ బౌలర్లు తమ పదునైన బంతులతో టీమిండియా బ్యాట్స్మెన్స్ను గాయాలపాలు చేశారు. డ్రెస్సింగ్ రూమ్ ప్రభావంతో సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్ బ్యాట్తో తన ఇన్నింగ్స్ ఫైటింగ్ను స్టార్ట్ చేశాడు. ఆసీస్ బౌలర్లు ఎంత రెచ్చగొట్టినా తడబడకుండా ఆడాడు. ఆసిస్ బౌలర్లు బంతులతో తనకు గాయాలు చేస్తున్నా మౌనంగా ఆడి 40 పరుగులు చేశాడు. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్ పంత్. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
భారత బ్యాట్స్మెన్స్ ఆసిస్ పేసర్లు చుక్కలు చూపించారు. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్, పదునైన పేస్తో టీమిండియా ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టారు. అవుటవ్వకుండా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసిన వారిపైకి బంతులేస్తూ భయపెట్టారు. పంత్ ఒళ్లంతా గాయాలు చేశారు. ఆసీస్ పేసర్ల దెబ్బకు భారత ఫిజియో రెండుసార్లు గ్రౌండ్లోకి రావాల్సి వచ్చింది. స్టార్క్ వేసిన బౌన్సర్కు పంత్ భుజం వద్ద తగిలిన గాయం నల్లగా కమిలిపోయింది. ఇక బోలాండ్ వేసిన బంతి థై ప్యాడ్స్ పైభాగాన తగలడంతో అక్కడ వాపొచ్చింది.
- వికెట్ కాపాడే ప్రయత్నం చేసిన లోయర్ ఆర్డర్ బ్యాటర్లనూ ఆసిస్ బౌలర్లు భయపెట్టారు. వాషింగ్టన్ సుందర్(14) బాక్స్కు గురిపెట్టి బంతులేశారు.
- ఆఖరిగా వచ్చిన బ్యాట్స్మెన్ సిరాజ్ను అయితే ఏకంగా దవడ పగలగొట్టారు. బంతి దవడకు తగలగానే సిరాజ్ విలవిలలాడిపోయాడు.