ఉస్మానియా ఆస్పత్రి నూత‌న భ‌వ‌నం.. – సీఎం రేవంత్ శంకుస్థాపన

ఉస్మానియా ఆస్పత్రి నూత‌న భ‌వ‌నం.. - సీఎం రేవంత్ శంకుస్థాపన

ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. 26.3 ఎకరాల్లో, 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నూతన ఆస్ప‌త్రిని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్నారు. రెండు వేల పడకల సామర్థ్యంతో ఈ కొత్త ఆస్ప‌త్రిని రూ. 2400 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. 14 అంతస్తుల భవనంలో 30 విభాగాల వైద్య సేవలు అందించనున్నారు. రోబోటిక్ సర్జరీలు, అత్యాధునిక మార్చరీ, మెడికల్ స్టూడెంట్స్‌ కోసం ప్రత్యేక భవనాలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఇందులో లభించనున్నాయి.

ప్రస్తుత అఫ్జల్‌గంజ్ ఆస్పత్రి పాత‌ప‌డ‌టంతో గోషామహల్ స్టేడియంలో కొత్త ఆస్ప‌త్రిని నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రహదారులను విస్తరించనున్నారు. ప్రతీ విభాగానికి ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ వార్డులు ఏర్పాటు చేయనున్నారు.

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment