విజయోత్సవ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో 11 మంది మృతి (Video)

విజయోత్సవ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో 8 మంది మృతి (Video)

బెంగళూరు (Bengaluru)లోని ఎం. చిన్నస్వామి స్టేడియం (M. Chinnaswamy Stadium)వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) (RCB)ఐపీఎల్ 2025 (IPL 2025) విజయోత్సవ ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. 18 ఏళ్ల త‌రువాత ఆర్సీబీ క‌ప్పు గెల‌వ‌డంతో క‌ర్ణాట‌క రాజ‌ధాని (Karnataka Capital)బెంగ‌ళూరులో చిన్న‌స్వామి స్టేడియం వ‌ద్ద సంబ‌రాలు ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన విజ‌యోత్స‌వ ర్యాలీ(Victory Rally)కి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ఆర్సీబీ ఫ్యాన్స్‌ మృతి (Died)చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన విషాదాన్ని నింపింది.

ఘటన వివరాలు
ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)ను ఆరు రన్స్ తేడాతో ఓడించి, 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత తమ తొలి ఐపీఎల్ టైటిల్‌(First IPL Title)ను ఆర్సీబీ సాధించింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) (43 రన్స్), రజత్ పాటిదార్ నేతృత్వంలో జట్టు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో ఈ విజయాన్ని సాధించింది. ఈ విజయాన్ని బెంగళూరు అభిమానులతో పంచుకునేందుకు జట్టు బుధవారం (జూన్ 4) విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్-టాప్ బస్సు ర్యాలీని ప్లాన్ చేసింది. అయితే, ట్రాఫిక్ రద్దీ, భద్రతా కారణాలతో ఈ ర్యాలీని రద్దు చేసినట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.

దీని స్థానంలో, చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టికెట్ లేదా పాస్ ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించారు. అయినప్పటికీ, లక్షలాది అభిమానులు స్టేడియం గేట్ల వద్ద గుమిగూడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో సహా 11 మంది మృతి చెందారని, 50 మందికి పైగా గాయపడినట్లు స‌మాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

తొక్కిసలాట కారణాలు
వేలాది మంది అభిమానులు విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, ఫాఫ్ డు ప్లెసిస్ వంటి ఆటగాళ్లను చూసేందుకు స్టేడియం గేట్ల వద్ద గుమిగూడారు. కొందరు అభిమానులు గేట్లు ఎక్కి, ఫెన్స్‌లను దాటే ప్రయత్నంలో గాయపడ్డారు. ఈ గందరగోళంలో పోలీసులు లాఠీఛార్జ్‌కు దిగారు, కానీ భారీ జనసమూహాన్ని నియంత్రించడం కష్టతరమైంది. రద్దీ కారణంగా రోడ్లు, మెట్రో స్టేషన్లు (కబ్బన్ పార్క్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేషన్) బ్లాక్ అయ్యాయి, అంబులెన్స్‌లు సకాలంలో ఆసుపత్రులకు చేరుకోలేకపోయాయి. గాయపడిన వారిని శివాజీనగర్‌లోని బౌరింగ్ హాస్పిటల్, విఠల్ మల్యా రోడ్‌లోని వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.

డీకే శివ‌కుమార్ క్ష‌మాప‌ణ‌..
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్టేడియం వద్ద పరిస్థితిని పరిశీలించి, ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు డిప్యూటీ సీఎం క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. బౌరింగ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను సీఎం సిద్ధ‌రామ‌య్య ప‌రామ‌ర్శించ‌నున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment