ఆర్సీబీ విజయం: కోహ్లీ, అనుష్క భావోద్వేగ క్షణాలు!

ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ విజయం: కోహ్లీ, అనుష్క భావోద్వేగ క్షణాలు!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) (Royal Challengers Bangalore – RCB) 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్‌ (IPL Title)ను సాధించడంతో కర్ణాటక (Karnataka)తో పాటు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) విరాట్ కోహ్లీ (Virat Kohli) అభిమానులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ విజయంతో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆమె మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చి కోహ్లీని కౌగిలించుకుని భావోద్వేగానికి (Emotion) గురైంది. ఈ ఈ ఎమోష‌న‌ల్ సీన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అనుష్క వెంటనే ఆయన వద్దకు చేరుకుని ఓదార్చింది. అనుష్క గురించి మాట్లాడుతూ.. “అనుష్క నా పక్కన అన్ని కష్టనష్టాల్లోనూ అండగా నిలిచింది. ప్రతి ఆర్సీబీ మ్యాచ్‌కు వచ్చి జట్టుకు మద్దతు ఇచ్చింది. ఈ విజయం ఆమెకు చాలా గర్వకారణం. నాతో పాటు అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఆమె, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా వెనుక నిలబడింది. బెంగళూరు (Bengaluru)తో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది, ఎందుకంటే ఆమె బెంగళూరు అమ్మాయి. అందుకే ఈ గెలుపు ఆమెకు కూడా చాలా ప్రత్యేకం. ఈ విజయంతో ఆమె చాలా గర్వపడుతోంది” అని విరాట్ త‌న భార్య గురించి గొప్ప‌గా చెప్పుకొచ్చాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment