ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) సీజన్లో భాగంగా బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాత్రి ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) రెండు పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)పై ఉత్కంఠ భరితమైన విజయం (Victory) సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాణించగా, చివర్లో ఫినిషర్లు కూడా భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అనంతరం ఛేజ్కు దిగిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 211 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్ వరకూ కుదిపేసిన ఈ మ్యాచ్లో, ఆఖర్లో ఆర్సీబీ బౌలర్లు ఒత్తిడిలోనూ చక్కగా రాణించారు.
ఈ విజయంతో ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ (Playoffs) లోకి చేరిన మొదటి జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఈ విజయం జట్టు మనోబలాన్ని పెంచగా, అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహం నింపింది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే లక్ష్యంతో జట్టుకు పట్టుదలగా ఉంది. కింగ్ కోహ్లీ అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు.