షమీని ఉంటే భారత్ బలంగా ఉండేది – రవిశాస్త్రి కీల‌క వ్యాఖ్య‌లు

షమీని ఉంటే భారత్ బలంగా ఉండేది - రవిశాస్త్రి కీల‌క వ్యాఖ్య‌లు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన నేపథ్యంలో, భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అనుభవజ్ఞుడైన పేసర్ మహ్మద్ షమీ అందుబాటులో లేకపోవడం జట్టుకు ప్రధాన నష్టం కలిగించిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీనియ‌ర్ ఫాస్ట్ బౌల‌ర్ షమీని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లి ఉంటే భారత జట్టు మరింత బలంగా ఉండేదని నమ్ముతున్నాన‌ని రవిశాస్త్రి అన్నారు. షమీ ఫిట్‌నెస్ స్టేటస్ గురించి సరైన సమాచారం ఎందుకు ఇవ్వబడలేదని ప్రశ్నించిన ఆయన, ఇది జట్టు తయారీ, ప్రణాళికపై ప్రభావం చూపిందని వ్యాఖ్యానించారు.

ఇతర బలహీనతలు కూడా..
స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనలో అనిశ్చితి, మిడిలార్డర్ లోపాలు, బూమ్రాకు ఇతర బౌలర్ల నుంచి సరైన మద్దతు అందకపోవడం వంటి అంశాలు భారత జట్టు విజయాన్ని దెబ్బతీశాయని ఆయన అన్నారు. ఈ లోపాలను దృష్టిలో ఉంచుకుని జట్టు కూర్పులో మార్పులు అవసరమని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment