రేవ్ పార్టీ కల్చర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాకు పాకింది. కాంక్రీట్ నగరాల కల్చర్ నేడు ఏపీలోని మారుమూల పల్లెలకు వచ్చి చేరింది. ఏలూరు జిల్లాలో 50 మంది అమ్మాయిలతో జనసేన నేత నిర్వహించిన రేవ్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
జనసేన నేత పుట్టినరోజు
నిడమర్రు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర క్రొవ్విడి గ్రామ శివారులోని ఓ మిల్లులో రేవ్ పార్టీ ఏర్పాటు చేసి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయడంతో పాటు భారీగా మందు- విందు ఏర్పాటు చేశారు. వాకమూడి ఇంద్ర పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
50 మంది అమ్మాయిలతో జనసేన నేత అశ్లీల నృత్యాలు
— greatandhra (@greatandhranews) December 19, 2024
నిడమర్రు మండల అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర క్రొవ్విడి గ్రామ శివారులోని ఓ మిల్లులో రేవ్ పార్టీ ఏర్పాటు చేసి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయడంతో పాటు భారీగా మందు- విందు ఏర్పాటు pic.twitter.com/xMpxzxKOvv
అశ్లీల నృత్యాలు
జనసేన నేత, ఆయన అనుచరులు కూడా నగ్నంగా ఉన్న మహిళలతో డ్యాన్సులు వేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉంగుటూరు జనసేన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అండతో ఆ పార్టీ నేతల నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతోందని ప్రజలు వాపోతున్నారు.
పవన్ ఎలా స్పందిస్తారు..
కాగా, జనసేన నేతల అరాచకంపై సామాజిక మాధ్యమాల్లో పవన్ కల్యాణ్పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటీజన్లు. సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పిన పవన్.. మరి జనసేన నేతలు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించడంపై ఎలా స్పందిస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రెండు బెత్తం దెబ్బలు సరిపోతాయా అని మరికొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.