రామ్ గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు – ఎందుకు?

రామ్ గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు – ఎందుకు?

టాలీవుడ్ వివాదాస్ప‌ద డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కు ఒంగోలు పోలీసులు (Ongole Police) మరోసారి నోటీసులు పంపించారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని రూరల్ సీఐ శ్రీకాంత్ వాట్సాప్ ద్వారా నోటీసులు (Legal Notice) అందజేశారు. గతంలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నారా లోకేశ్‌(Nara Lokesh)లపై అస‌భ్య‌క‌ర పోస్టులు ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశార‌ని ఫిర్యాదు మేర‌కు ఈ వ్యవహారంపై 2023 నవంబర్ 10న వర్మపై కేసు నమోదైంది. పోలీసుల విచారణలో సహకరించాల్సిందిగా, తాజా నోటీసుల ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రామ్ గోపాల్ వర్మ ఈ నోటీసులపై ఎలా స్పందిస్తారు? తదుపరి పరిణామాలు ఏవీ? వేచి చూడాలి.

గతంలోనూ రామ్ గోపాల్ వ‌ర్మ‌కు రెండుసార్లు ఒంగోలు పోలీసులు నోటీసులు జారీ చేసిన‌ప్పటికీ విచారణకు హాజరుకాలేదు. త‌న‌పై న‌మోదైన కేసుపై హైకోర్టును ఆశ్రయించడంతో RGVకి కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు త‌న ఆదేశాల్లో దర్యాప్తునకు సహకరించాలని, పోలీసులు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని రామ్‌గోపాల్‌వర్మకు సూచించింది. ఈ నేపథ్యంలో మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేసిన‌ట్లు స‌మాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment