గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, బుచ్చిబాబు (Buchibabu) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ (‘Peddi’)పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, తదుపరి షెడ్యూల్లో రామ్ చరణ్ మరియు జాన్వీ కపూర్లపై ఒక పాటను చిత్రీకరించనున్నారు.
దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City)లో ప్రత్యేకమైన సెట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సాంగ్లో రామ్ చరణ్ వేసే స్టెప్పులు, జాన్వీ కపూర్ గ్లామర్ ప్రధాన హైలైట్స్గా ఉంటాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. రామ్ చరణ్ కెరీర్లో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల కంటే ‘పెద్ది’ చాలా భిన్నంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. బుచ్చిబాబు ప్రత్యేకమైన ఎమోషన్, యాక్షన్ మిక్స్తో ఈ స్క్రిప్ట్ను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ వంటి ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటం అదనపు ఆకర్షణ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.








