సముద్రమార్గంగా ఉగ్రవాదుల చొరబాట్లపై తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ ప్రజలకు కీలక హెచ్చరిక చేశారు. ఒక వీడియో సందేశంలో ఆయన దేశ భద్రతపై పెరుగుతున్న ముప్పును ప్రస్తావిస్తూ, ఉగ్రవాదులు సముద్ర మార్గాన్ని వినియోగించి దేశంలో దాడులకు పాల్పడే అవకాశముందని తెలిపారు.
ప్రజల బాధ్యత ఎంతో కీలకం
సముద్రతీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదుల కుతంత్రాలను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా 26/11 ముంబై ఉగ్రదాడిని ఉదహరించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సీఐఎస్ఎఫ్ జవాన్లు 100 మంది పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 7 వేల కిలోమీటర్ల సైకిల్ ప్రచార యాత్ర చేపట్టనున్నారని తెలిపారు.