తమిళ స్టార్ దర్శకుడు శంకర్కు ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) బిగ్ షాకిచ్చింది. శంకర్కు చెందిన రూ. 10.11 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. రోబో సినిమా కథను కాపీ కొట్టారని, దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఈడీ స్పష్టం చేస్తోంది. తన కథను శంకర్ కాపీ కొట్టారని 2011లో తమిళ రచయిత ఆరూర్ తమిళ్నందన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది.
ఆరూర్ కథకు, రోబో కథకు పోలికలు ఉన్నాయని, దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొంటుంది. కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్ 63ను శంకర్ ఉల్లంఘించారని, రోబో సినిమా కోసం రూ. 11.5 కోట్ల రెమ్యూనరేషన్ను శంకర్ తీసుకున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోబో సినిమా రూ. 290 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ వెల్లడించింది.