కాంగ్రెస్ అగ్రనేత (Congress Senior Leader), లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి కార్యాలయం (PMO) కు వెళ్లారు. ఆయన అక్కడ సీబీఐ కొత్త డైరెక్టర్ (CBI New Director) ఎంపికకు సంబంధించిన నియామక కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షత వహించగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Supreme Court Chief) జస్టిస్ సంజీవ్ ఖన్నా(Sanjiv Khanna) కూడా హాజరయ్యారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీ – ప్రధాని, ప్రతిపక్ష నేత, మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి సీబీఐ డైరెక్టర్ ఎంపికపై చర్చించారు.
ప్రస్తుతం పదవిలో ఉన్న సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ (Praveen Sood) పదవీకాలం మే 25తో ముగియనుండటంతో, త్వరలోనే కొత్త డైరెక్టర్ను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. కమిటీ సూచించిన పేరుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నియామకం చేపడుతుంది.
సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు
ఇదిలా ఉండగా, సరిహద్దులో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు తీవ్రమయ్యాయి. సోమవారం కూడా సరిహద్దులో పాక్ సైనికులు అలజడి సృష్టించే ప్రయత్నం చేసినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీనికి ప్రతీగా భారత్ కూడా దీటైన సమాధానం చెప్పేందుకు సమాయత్తం అవుతోంది. ఏ క్షణమైనా భారత్ నుంచి సమాధానం ఉంటుందని భావిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. బుధవారం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కొన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది.