అల్లు అర్జున్ అరెస్టు అంశం తెలంగాణలో ఏదో ఓ మూలన రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఈ కేసు గురించి కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులు ఎవరూ మాట్లాడొద్దని సీఎం రేవంత్ సూచించినా, బన్నీ అరెస్టుపై ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి నోరు మెదుపుతూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ కిరణ్కుమార్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “పుష్పను అరెస్టు చేసి రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారు” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్సీ తీవ్రంగా మండిపడుతున్నారు. “మేము KCRలా ప్రతిపక్షాలను లేకుండా చేయాలనుకోవడం లేదు. బలమైన ప్రతిపక్షం ఉండడం ఆరోగ్యకరమైన రాజకీయాలకు చాలా అవసరం” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.