సీఐ (CI – Circle Inspector) వేధింపులు (Harassment) తాళలేక తల్లీకొడుకు (Mother And Son) రైలు పట్టాలపై (Railway Tracks) ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన వైఎస్సార్ జిల్లా (YSR District) ప్రొద్దుటూరు (Proddatur)లో చోటుచేసుకుంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అంగన్వాడీ టీచర్ (Anganwadi Teacher)గా పనిచేస్తున్న లక్ష్మీ (Lakshmi), ఆమె కుమారుడు(Son) మహిధర్ (Mahidhar)ను వన్ టౌన్ సీఐ రామకృష్ణ (CI-Ramakrishna) తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, సీఐ అరాచకాలను భరించలేక తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లీకొడుకులు రైలు పట్టాలపై పడుకొని తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసు శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. లక్ష్మీ తన చెల్లెలి భర్తకు అప్పు(Loan) ఇచ్చిన విషయంలో ఉత్పన్నమైన వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. ఈ కేసులో సీఐ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరిస్తూ, లక్ష్మీ, ఆమె కుమారుడు మహిధర్లను అనవసర కేసులో ఇరికించి, స్టేషన్కు పిలిపించి నిత్యం వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. “సీఐ నన్ను, నా కొడుకును బూట్లతో తన్నారు. ఆడమనిషినని కూడా చూడకుండా గేటు దగ్గర నుంచి ఈడ్చుకొచ్చి కొట్టారు. నా కొడుకు ఇంటర్మీడియట్ విద్యార్థి, చదువుకుంటున్నాడని మొరపెట్టుకున్నా, వినకుండా ఇష్టానుసారం దాడి చేశారు” అని లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ తమను చంపేస్తామని బెదిరించారని, ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు సిద్ధపడినట్లు వీడియోలో తెలిపారు. జిల్లా కలెక్టర్ (District Collector), ఎస్పీ(SP)లను న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు.
ఈ ఘటనపై స్థానిక రాజకీయ వర్గాలు, ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సీఐ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తం అవుతోంది. “పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా ఫుటేజ్ (CCTV Camera Footage)ను పరిశీలిస్తే నిజం బయటపడుతుంది” అని బాధితులు లక్ష్మీ, ఆమె కుమారుడు మహిధర్ వాపోయారు. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల అనంతపురంలో పోలీసు నిర్లక్ష్యంతో ఓ యువతి మరణించిన నేపథ్యంలో, ఈ ఘటన పోలీసు శాఖపై మరింత ఒత్తిడి తెచ్చింది.