ఉండ‌వ‌ల్లిలో రౌడీగ్యాంగ్ హ‌ల్‌చ‌ల్‌.. 5 నెలల గర్భిణీపై దాడి (Video)

ఉండ‌వ‌ల్లిలో రౌడీగ్యాంగ్ హ‌ల్‌చ‌ల్‌.. 5 నెలల గర్భిణీపై దాడి (Video)

ఐదునెల‌ల గ‌ర్భణీగా ఉన్న మ‌హిళా కానిస్టేబుల్ (Female Constable) అల్ల‌రిమూక‌లు రెచ్చిపోయారు. తాగిన మైకంలో కానిస్టేబుల్ దంప‌తుల‌పై రౌడీయిజం ప్ర‌ద‌ర్శిస్తూ వారిపై దాడి చేసిన ఘ‌ట‌న తాడేప‌ల్లి (Tadepalli) మండ‌లం ఉండ‌వ‌ల్లి (Undavalli)లో ముఖ్య‌మంత్రి నివాసానికి (Chief Minister’s Residence) కూత‌వేటు దూరంలో జ‌ర‌గ‌డం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. రౌడీ గ్యాంగ్ (Rowdy Gang) దాడి చేసిన ఘటనలో ఐదు నెలల గర్భిణీ (Five Months Pregnant) అయిన సునీత (Sunitha) తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో సునీత, ఆనంద్ దంపతులు విజయవాడ (Vijayawada)లోని రైల్వే క్వార్టర్స్ నుంచి విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఉండవల్లి మాలపల్లిలోని తమ నివాసానికి తిరిగి వస్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి వారి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. అత‌ని చ‌ర్య‌పై ఆగ్ర‌హానికి గురైన సునీత భ‌ర్త ఆనంద్ బైక్ దిగి ఆ వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. అయితే, ఆ వ్యక్తి సునీత వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సునీత తన చెప్పుతో ఆ వ్యక్తిని కొట్టింది. రెచ్చిపోయిన ఆ దుండగుడు 10-15 మంది రౌడీ గ్యాంగ్‌ను ఫోన్ చేసి పిలిపించి, దంపతులపై దాడి చేయించాడు.

“నా భార్య గర్భవతి, దయచేసి వదిలేయండి” అని ఆనంద్ (Anand) ప్రాధేయపడినప్పటికీ, దుండగులు కనికరించకుండా బండరాళ్లతో దాడి చేశారని బాధిత దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో సునీత, ఆనంద్ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని కాపాడేందుకు ముందుకొచ్చిన స్థానికులు, ఇతర వాహనదారులను కూడా “చంపేస్తాము” అని రౌడీ గ్యాంగ్ బెదిరించినట్లు సునీత తెలిపారు. ప్రస్తుతం ఈ దంపతులు విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, స్థానికుల సమాచారం ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ ఘటన సీఎం నివాసానికి సమీపంలో జరగడం, రాష్ట్రంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. ఇటీవ‌ల మందుబాబుల ఆగ‌డాలు తీవ్ర‌మ‌య్యాయ‌ని, పోలీసులు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment