ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్.. నిజ‌మెంత‌..?

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ క‌ల‌క‌లం..?

ప్రకాశం జిల్లా (Prakasam district) పోలీసు వ్యవస్థపై(Police System) మళ్లీ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ అనుమానితుడు పోలీసు దాడుల్లో మరణించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారుల తీరుపై న్యాయవాదులు, మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. గత ఏప్రిల్‌లో ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత (TDP leader), మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి (Muppavarapu Veerayya Chowdary) హత్యకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో రియల్ ఎస్టేట్ మరియు మద్యం వ్యాపార సిండి‌కేట్‌ల మధ్య విభేదాలు హత్యకు దారితీశాయని, పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీడీపీలోని వీరయ్య చౌదరి వైరి వర్గం వారే ఈ హత్యకు పాల్పడ్డారని కూడా గుర్తించినట్టు సమాచారం.

ఇదిలా ఉండ‌గా, దర్యాప్తు వేగవంతం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో, జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఈ కేసును వెంటనే ఛేదించాలనే దృష్టితో అనుమానితులపై విచారణను ఉధృతం చేసిన‌ట్లుగా స‌మాచారం. ఇటీవల అనుమానితులలో ఓ వ్యక్తిని (One Person) ఒంగోలు (Ongole) లోని పోలీసు శిక్షణ కేంద్రం(Police Training Center)లో రహస్యంగా నిర్బంధించి విచారించిన (Interrogated) పోలీసులు, విచారణ పేరుతో తీవ్రంగా వేధించినట్టు తెలుస్తోంది. ఈ పోలీసు దాడుల్లో తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి, చికిత్స అంద‌క‌ మృతిచెందినట్టు (Died) తెలుస్తోంది.

అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, బాధిత కుటుంబాన్ని బెదిరించి విషయం గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా, ఇంటి వద్ద నిఘా ఏర్పాటు చేసి, మీడియా, హక్కుల సంఘాల అడ్డుకునే ప్రయత్నం కొన‌సాగుతున్న‌ట్లుగా ప్ర‌కాశం జిల్లాలో చ‌ర్చ జ‌రుగుతుంది. అంత్యక్రియలు కూడా గుట్టుచప్పుడు కాకుండా పూర్తిచేయించినట్టు సమాచారం.

ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్రజాస్వామ్యంలో, పోలీస్ వ్యవస్థ చేతులలో నిర్దోషులు మృతిచెందడం ఏంట‌ని, కేసు ఛేదన వేగం పేరిట ఓ వ్య‌క్తిని కొట్టి చంప‌డం ఏంట‌న్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. టీడీపీ నేత కేసును ఛేదించేందుకు విచార‌ణ పేరిట అనుమానితుల‌ను కొట్టి చంపేయ‌డం ఏంట‌ని స్థానికంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఏంటీ దారుణ‌మ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌ నెటిజ‌న్ల నుంచి సైతం ప్ర‌శ్నలు ఎదుర‌వుతున్నాయి. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు, న్యాయ వ్యవస్థ తక్షణ స్పందన ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment