‘నా బుక్ తీయ‌నా..?’ లోకేష్‌పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

'నా బుక్ తీయ‌నా..?' లోకేష్‌పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ మంత్రి లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. రెడ్‌బుక్ పేరుతో ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌పై దాడులు, దౌర్జ‌న్యాల‌కు పాల్పడుతున్నాడ‌ని మండిప‌డ్డారు. ‘నా బుక్ తీశానంటే నువ్వు, నీ బాబు ఉండ‌రు.. నా ప‌వ‌ర్ గురించి నీ తండ్రి చంద్ర‌బాబును క‌నుక్కో. నువ్వు ఎంత‌మంది మీద దాడులు చేయిస్తున్నావో చూస్తున్నా.. నిన్ను జైల్లో పెట్టి తీరుతా.. నీ బాబు జైలుకు వెళ్తాడ‌ని చెప్పా.. అన్న‌ట్లుగానే జ‌రిగింది. లోకేశ్ నువ్వు ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకో..’ అంటూ కేఏ పాల్ సెటైర్లు వేశారు.

‘రెడ్ బుక్ పేరుతో ఇంకెవ‌రినైనా ట‌చ్ చేస్తే నీ తండ్రి చంద్ర‌బాబును జైల్లో పెడ‌తా, నిన్ను జీరో చేస్తా లోకేశ్ గుర్తుంచుకో.. అధికారం ఉంద‌ని పిచ్చోడిలా ప్ర‌వ‌ర్తించ‌వ‌ద్దు. నువ్వెంత‌.. రాజ‌శేఖ‌ర‌రెడ్డి గోరు తీయ‌డానికి స‌రిపోవు. మీ నాన్నే వైఎస్సార్ ముందు భ‌య‌ప‌డేవాడు. మీ నాన్న నా శిష్యుడు, నా స్పిరిచువల్ ప‌వ‌ర్ ప్ర‌యోగించానా.. నాకు ఎవ‌రూ లెక్క‌లేదు. వైఎస్ జ‌గ‌న్ ఏ రోజూ నా మీద కేసులు పెట్ట‌లేదు’.

‘అపోజిష‌న్ లేకుండా జీరో చేసి బీజేపీని, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను చంద్ర‌బాబు తొత్తులుగా వాడుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయి. విశాఖ‌లో టీడీపీ ఎంపీ శ్రీ‌భ‌ర‌త్‌కు ఐదు ల‌క్ష‌ల ఓట్ల కాదు ఐదు వంద‌లు కూడా ప‌డ‌లేదు. కానీ, ఐదు ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీ ఎలా వ‌చ్చింది. బాల‌కృష్ణ ముఖం, లోకేశ్‌, చంద్ర‌బాబు ముఖం చూసి ప్ర‌జ‌లు ఓట్లు వేశారా..?’

‘ప్యాకేజీ స్టార్లు ప‌వ‌న్‌, చిరంజీవి, ష‌ర్మిల‌ను మ‌రిచిపోయి ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్ర‌జ‌ల‌ను గెలిపిద్దాం. ఆర్‌.కృష్ణ‌య్య‌ను బీజేపీ తొత్తుగా వాడుకుంటుంది. రూపాయి తీసుకోకుండా వైఎస్ జ‌గ‌న్ కృష్ణ‌య్య‌కు ఎంపీ సీటు ఇస్తే దానికి రాజీనామా చేసి.. బీజేపీ వ‌ద్ద 15 వంద‌ల కోట్ల డీల్ కుదుర్చుకున్నాడు. ఏపీ, తెలంగాణ‌లో ప్యాకేజీ స్టార్లు ష‌ర్మిల‌, ప‌వ‌న్‌లాగే కొత్త‌గా చిన్నోడు తీన్మార్ మ‌ల్ల‌న్న వ‌చ్చాడు. నేను బీసీని అంటూ కొత్త అవ‌తారం ఎత్తి ఆర్‌.కృష్ణ‌య్య శిష్యుడు తీన్మార్ మ‌ల్ల‌న్న వ‌చ్చాడు’ అంటూ కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment