మెగా స్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసగించే ప్యాకేజీ స్టార్లను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. “మీరు మెగా బ్రదర్స్ మాటలు నమ్మితే మెంటల్ అయిపోతారు” అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
కేబినెట్ మీటింగ్కు హాజరు కాకుండా పవన్ కళ్యాణ్ ఆలయాల చుట్టూ తిరుగుతున్నారని, చిరంజీవి వారసత్వం గురించి మాట్లాడడం సరికాదని అన్నారు. మహిళలను దేవతలా పూజిస్తున్న దేశంలో మహిళలను కించపరిచేలా చిరంజీవి మాట్లాడారని, అందుకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇవ్వలేక, పసిబిడ్డలను చంపుతుంటే ఖండించాల్సిందిపోయి మనవడు పుడితే బాగుండని అంటారా..? అని చిరంజీవిని కేఏ పాల్ అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ డ్రామాలకు చంద్రబాబు మోసపోయారని, పవన్ని నమ్మి చంద్రబాబు తన కుమారుడికే అన్యాయం చేస్తున్నారని కేఏ పాల్ ఆసక్తికర కామెంట్లు చేశారు. మెగా ఫ్యామిలీకి ఓటు బ్యాంక్ లేదన్న వాస్తవం తెలియదా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.